మద్దిపాడు: స్థానిక పోలీస్స్టేషన్లో ఏఎస్సైగా పనిచేస్తున్న వెంకట లక్ష్మి రాష్ట్రస్థాయి పోటీల్లో 40 ప్లస్ కేటగిరీలో 100 మీటర్ల హార్డిల్స్లో ప్రథమస్థానం కైవసం చేసుకున్నారు. 4 x100 మీటర్ల రిలే పరుగులో కాంస్య పతకం సాధించారు. ఈ నెల 9,10 తేదీల్లో తిరుపతి ఎస్వీ యూనివర్సిటీలో జరిగిన 32వ స్టేట్ మాస్టర్స్ ఆథ్లెటిక్స్ చాంపియన్ షిప్ రాష్ట్ర స్థాయి పోటీల్లో కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏఎస్ఐ వెంకట లక్ష్మిని ఎస్పీ మలికాగర్గ్ ప్రత్యేకంగా అభినందించారు. ఫిబ్రవరిలో పూనేలో జరగనున్న జాతీయస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. .