ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం విద్యతో పాటు క్రీడారంగానికీ అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని టీచర్స్ ఎమ్మెల్సీ టి.కల్పలత రెడ్డి అన్నారు. అండర్–19 ఎస్జీఎఫ్ 67వ జాతీయ బ్యాడ్మింటన్ బాలబాలికల పోటీల ప్రారంభోత్సవం విజయవాడలోని పీబీ సిద్ధార్థ అర్ట్స్,సైన్స్ కాలేజీ ప్రాంగణంలో మంగళవారం జరిగింది. పాఠశాల విద్య కమిషనర్ ఎస్.సురేష్కుమార్తో కలిసి ఆమె ఈ పోటీలను ప్రారంభించి ప్రసంగించారు. విద్యారంగ సంస్కరణలు అమలు చేయడంతో పాటు క్రీడా ప్రతిభను వెలికితీసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 15 నుంచి ‘ఆడుదాం.. ఆంధ్రా’ క్రీడోత్సవాలను నిర్వహించనుందని తెలిపారు. బ్యాడ్మింటన్ జాతీయ టోర్నీకి విజయవాడ వేదిక కావడం ఆనందంగా ఉందన్నారు. రాష్ట్ర పాఠశాల విద్య కమిషనర్ ఎస్.సురేష్కుమార్ మాట్లాడుతూ.. తెలుగు నేలపై నుంచి పుల్లెల గోపీచంద్, సైనా నెహ్వాల్, పి.వి.సింధు భారతీయ క్రీడా ప్రతిభను ప్రపంచానికి చాటారని గుర్తు చేశారు..