Tuesday 14th of May 2024

మాది పెత్తందార్ల పార్టీ కాదు.. ప్రజల పార్టీ

13 Dec , 2023 12:49 , IST
Article Image

కలువాయి: వైఎస్సార్‌సీపీ పెత్తందార్ల పార్టీ కాదని.. ప్రజల పార్టీ అని ఆ పార్టీ వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త నేదరుమల్లి రామ్‌కుమార్‌రెడ్డి అన్నారు. కలువాయి మండలం కుల్లూరు ఒకటో సచివాలయం పరిధిలో మంగళవారం నిర్వహించిన ‘ఏపీకి జగనే ఎందుకు కావాలంటే’ కార్యక్రమంలో ఆయన పాల్గొని సంక్షేమ పథకాల డిస్‌ప్లే బోర్డును ఆవిష్కరించారు. అనంతనం ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అన్నివర్గాలకు మేలు చేకూరేలా సంక్షేమ పథకాలను అమలు చేసిందని తెలిపారు. ప్రజలు కూడా ఆలోచించి తమకు ఎవరు మేలు చేశారో వారినే ఎన్నుకోవాలని పిలుపునిచ్చారు. ఇచ్చిన హామీలను నూరుశాతం అమలు చేసిన సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని మరోసారి ముఖ్యమంత్రిని చేయాలని కోరారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ మండల కన్వీనర్‌ ఎంవీ కృష్ణారెడ్డి, జేసీఎస్‌ కన్వీనర్‌ మాదాసు యజ్ఞపవన్‌, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.రైతులు సాగు చేసుకుంటున్న ప్రభుత్వ భూములపై వారికి శాశ్వత హక్కులు కల్పి ంచిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికే దక్కిందని నేదురుమల్లి రామ్‌కుమార్‌రెడ్డి అన్నారు. కలువాయిలోని ఉమామహేశ్వరి కల్యాణ మండపంలో మంగళవారం రైతులకు పూర్తి హక్కులతో కూడిన పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు ఎవరూ ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుందని తెలిపారు. రైతులు ఇక నిర్భయంగా తమ పొలాలను సాగు చేసుకోవచ్చని, క్రయ విక్రయాలకు కూడా ప్రభుత్వం హక్కులు కల్పించినట్లు తెలిపారు. మండలంలోని 650 మంది రైతులకు శాశ్వత హక్కు పత్రాలను అందజేశామన్నారు. .