రాజమహేంద్రవరం: వైఎస్సార్ సీపీ రాష్ట్ర స్థాయి పదవులు తూర్పుగోదావరి జిల్లా నేతలకు వరించాయి. ఈమేరకు పార్టీ కేంద్ర కార్యాలయం మంగళవారం ఉత్తర్వులు వెలువరించింది. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల యువజన విభాగ రీజనల్ కోఆర్డినేటర్గా వ్యవహరిస్తున్న జక్కంపూడి గణేష్ను రాష్ట్ర యువజన విభాగ జోనల్ ఇన్చార్జ్గా నియమించారు. తనకు పదవి ఇచ్చినందుకు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ రాష్ట్ర మహిళా విభాగ ప్రధాన కార్యదర్శిగా ఆచంట అనసూయ నియమితులయ్యారు. ఈమె గోపాలపురం నియోజవర్గ కన్వినర్గా బాధ్యతలు నిర్వర్తించారు. ప్రస్తుతం ద్వారకాతిరుమల దేవస్థానం ట్రస్ట్బోర్డ్ మెంబర్గా వ్యవహరిస్తున్నారు. తనను రాష్ట్ర స్థాయి పదవికి ఎంపిక చేసినందుకు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. మహిళా విభాగం ద్వారా పార్టీ బలోపేతానికి అహర్నిశలు కృషి చేయనున్నట్లు వెల్లడించారు. .