కర్నూలు (రాజ్విహార్): వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం రాష్ట్ర కమిటీలో కర్నూలు జిల్లాకు చెందిన నాయకులకు చోటు దక్కింది. ఎం.మధుసూదన్రెడ్డిని జోనల్ ఇన్చార్జ్ (జోన్–7), బి.అబ్దుల్లా ఖాన్ పర్వేజ్ (బీఏకే పర్వేజ్) కార్యదర్శిగా, షేక్ రియాజ్ (రియాజ్ బాబా) సంయుక్త కార్యదర్శిగా నియమిస్తూ పార్టీ కేంద్ర కార్యాలయం మంగళవారం రాత్రి ఒక ప్రకటన విడుదల చేసింది. పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు యువజన విభాగం కమిటీలో చోటు కల్పించామని అందులో తెలిపారు. .