రాజాం సిటీ: మండలంలో బొద్దాం గ్రామానికి చెందిన ఆటోడ్రైవర్ బొర్రా వాసు తన నిజాయితీని చాటుకున్నాడు. రెండురోజుల క్రితం తనకు తన ఆటోలో తులంపావు బంగారు గొలుసు అతనికి దొరికింది. ఈ గొలుసు ఆటోలో ప్రయాణిస్తున్న వారిదిగా గుర్తించి రాజాం పోలీసులకు సమాచారం అందించాడు. ఇంతలో జీఎంఆర్ఐటీలో చదువుతున్న శ్రీకాకుళానికి చెందిన మాధవి అనే విద్యార్థిని రెండురోజుల క్రితం ఈ ఆటోలో ప్రయాణిస్తున్నప్పుడు బంగారు గొలుసుపోయినట్లు గుర్తించి తన కుటుంబసభ్యులతో వచ్చి మంగళవారం ఆటోడ్రైవర్ను కలిసి చెప్పింది. వెంటనే ఆటో డ్రైవర్ రాజాం ఎస్సై రవికిరణ్ను సంప్రదించి, విద్యార్థిని వివరాలు వెల్లడించాడు. దీంతో పోలీసులు పూర్తిస్థాయిలో పరిశీలించి, ఆ చైన్ విద్యార్థినిదేనని గుర్తించి ఎస్సై సమక్షంలో ఆమెకు ఆటోడ్రైవర్తో గోల్డ్చైన్ ఇప్పించారు. ఆటో డ్రైవర్ వాసు నిజాయితీని ఈ సందర్భంగా పలువురు అభినందించారు..