Monday 13th of May 2024

జాతీయ స్థాయి క్యాంప్‌నకు జిల్లా విద్యార్థి

13 Dec , 2023 02:24 , IST
Article Image

జాతీయ స్థాయి ఎన్‌ఎస్‌ఎస్‌ అ డ్వెంచర్‌ క్యాంప్‌నకు జిల్లా విద్యార్థి ఎంపికయ్యాడు. ఆదిలాబాద్‌ పట్టణంలోని ప్రభుత్వ సైన్స్‌ డిగ్రీ కళాశాలలో ఎంపీసీ తృతీయ సంవత్సరం చదువుతున్న ఎన్‌ఎస్‌ఎస్‌ వలంటీర్‌ సూర్యకాంత్‌ ఇటీవల కేయూ విశ్వ విద్యాలయంలో నిర్వహించిన పోటీల్లో ప్రతిభ కనబర్చాడు. హిమాచల్‌ప్రదేశ్‌ రాష్ట్రం ధర్మశాలలోని అటల్‌బిహారి వాజ్‌పేయ్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మౌంటనీరింగ్‌ అండ్‌ అలైడ్‌ స్పోర్ట్స్‌ క్యాంప్‌నకు ఎంపికయ్యాడు. ఈ పోటీలు ఈనెల 23 నుంచి జనవరి 1 వరకు జరగనున్నాయి. ఈ క్యాంప్‌నకు విద్యార్థి ఎంపిక కావడంపై కళాశాల ప్రిన్సిపల్‌ శ్రీనివాస్‌, లెక్చరర్లు దయాకర్‌, అష్రఫ్‌ అలీ, సంతోష్‌, రఘునాథ్‌, రమేష్‌ అభినందించారు. .