ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన మహాలక్ష్మి పథకం జిల్లా వ్యాప్తంగా విజయవంతంగా అమలవుతోందని కలెక్టర్ రాహు ల్ రాజ్ అన్నారు. ఈమేరకు స్థానిక బస్టాండ్ను మంగళవారం ఆయన సందర్శించారు. మహిళా ప్ర యాణికులతో మాట్లాడి మహాలక్ష్మి పథకం అమలు తీరును అడిగి తెలుసుకున్నారు. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని ఆర్టీసీ అధి కారులను ఆదేశించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. మహాలక్ష్మి పథకాన్ని మహిళలు సద్విని యోగం చేసుకోవాలన్నారు. రద్దీగా ఉన్న రూట్లలో అదనపు బస్సులు సైతం కేటాయిస్తున్నామన్నారు. ఈ పథకం ద్వారా విద్యార్థినుల డ్రాప్ అవుట్ల సంఖ్య తగ్గుతుందన్నారు. ఇప్పటివరకు జిల్లాలో సుమారు 81 వేల మంది ఉచితంగా ప్రయాణించారని తెలిపారు. ఆయన వెంట డీపీఆర్వో విష్ణు, డీఎం కల్పన, విశ్వనాథ్, శ్రీకర్ తదితరులున్నారు..