Monday 13th of May 2024

బాస్కెట్‌బాల్‌ పోటీలకు అల్ఫోర్స్‌ విద్యార్థ.

13 Dec , 2023 03:25 , IST
Article Image

కొత్తపల్లిలోని అల్ఫోర్స్‌ ఇ–టెక్నో స్కూల్‌కు చెందిన 8వతరగతి విద్యార్థి టి.ముగ్ధహాసిని జాతీయస్థాయి ఎస్‌జీఎఫ్‌ బాస్కెట్‌బాల్‌ అండర్‌–14 బాలికల విభాగంలో రాష్ట్ర జట్టులో ప్రాతినిథ్యం వహించేందుకు ఎంపికై నట్లు విద్యాసంస్థల చైర్మన్‌ డా.వి.నరేందర్‌రెడ్డి తెలిపారు. రంగారెడ్డిలో ఇటీవల జరిగిన రాష్ట్రస్థాయి ఎస్‌జీఎఫ్‌ బాస్కెట్‌బాల్‌ పోటీల్లో ప్రతిభ కనబరిచి జాతీయస్థాయి పోటీలకు ఎంపికవడం గర్వంగా ఉందన్నారు. జాతీయస్థాయిలో సైతం సత్తా చాటి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. పాఠశాల ప్రిన్సిపాల్‌, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. .