తులేకలాన్ గ్రామాభివృద్ధికి అధిక నిధులు కేటాయిస్తానని ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి తెలిపారు. మండలంలోని తులేకలాన్ గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు, మండల వర్కింగ్ ప్రెసిడెంట్ కోడూరి రమేష్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే కలిశారు. శాలువతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రంగారెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వంలో నియోజకవర్గం అభివృద్ధి చెందడం ఖాయమన్నారు. అన్ని గ్రామాలకు ప్రభుత్వం నిధులు కేటాయిస్తుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలంతా అండగా నిలవాలని సూచించారు. కార్యక్రమంలో పాండు, శశాంక్రెడ్డి, సుదర్శన్, నారన్రెడ్డి, గోపాల్రెడ్డి, శశివర్ణ, జంగయ్య, విష్ణువర్ధన్రెడ్డి, గోపాల్రెడ్డి, కన్నారెడ్డి, వెంకటేష్, పాండు, ప్రభు, శ్రీకాంత్, లింగం, జంగయ్య పాల్గొన్నారు..