Monday 13th of May 2024

విద్యార్థుల అభ్యసన స్థాయిని పెంచాలి

13 Dec , 2023 04:20 , IST
Article Image

విద్యార్థుల అభ్యసన స్థాయిని పెంచడానికి ఉపాధ్యాయులు కృషిచేయాలని మోడల్‌ స్కూల్‌ డైరెక్టర్‌ పి.సరోజినీదేవి సూచించారు. మండలంలోని ఎడ్లపల్లి మోడల్‌ స్కూల్‌, రుద్రారం, ఎడ్లపల్లి ప్రాథమిక పాఠశాలల్లో మంగళవారం ఎఫ్‌ఎల్‌ఎన్‌ ఉన్నతి, లక్ష్యసాధనలో పర్యవేక్షణ కోసం ఆమె సందర్శించారు. విద్యార్థుల్లో అభ్యసన ఫలితాలు ఏ స్థాయిలో ఉన్నాయో నిర్ధారించేందుకు అమలు తీరును పర్యవేక్షించారు. వాటి సాధనకు ఉపాధ్యాయుడు మార్చుకోవాల్సిన బోధనా విధానాన్ని విద్యార్థులలో ఆశించిన స్థాయి ఫలితాలు రాబట్టడానికి వివిధ బోధన పద్ధతులు అవలంభించాలని తెలిపారు. విద్యార్థుల అభ్యసన స్థాయిలను ఎప్పటికప్పుడు పరిశీలించాలని సూచించారు. విద్యార్థుల అభ్యసన స్థాయిని పరీక్షించారు. ఈ కార్యక్రమంలో భూపాలపల్లి ఏఎంఓ లక్షణ్‌ ఉన్నారు..