Tuesday 14th of May 2024

ఆధ్యాత్మికం...

13 Dec , 2023 05:57 , IST
Article Image

మండల కేంద్రంలోని లక్ష్మీనరసింహస్వామి ఆలయ ప్రాంగణంలో ధర్మకర్త రాజ గంగారాం ఆధ్వర్యంలో మంగళవారం లక్ష దీపోత్సవం నిర్వహించారు. ఈసందర్భంగా మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని భక్తిశ్రద్ధలతో దీపాలను వెలిగించారు. ఆలయంలో పూజలు నిర్వహించారు.డిచ్‌పల్లి: మండల కేంద్రంలోని కాశీ విశ్వనాథ ఆల యం ఆవరణలో మంగళవారం అయ్యప్పస్వామి వారి సేవా సమితి ఆధ్వర్యంలో మంగళవారం అయ్యప్ప పడిపూజ వైభవంగా నిర్వహించారు. పండితులు రాజేందర్‌ త్రిపాఠి శర్మ ఆధ్వర్యంలో అయ్యప్ప, గణపతి, సుబ్రమణ్యస్వామి విగ్రహాలకు అభిషేకాలు నిర్వహించారు. అనంతరం భిక్ష (అన్నదానం) ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో రూరల్‌ ఎమ్మెల్యే భూపతిరెడ్డి, గురుస్వాములు మణికంఠ లక్ష్మీనర్సయ్య, నర్సయ్య, వెంకటరమణ, గంగారెడ్డి, మాజీ ఎంపీపీ కంచెట్టి గంగాధర్‌, కాంగ్రెస్‌ మండల అధ్యక్షుడు అమృతాపూర్‌ గంగాధర్‌, పొలసాని శ్రీనివాస్‌, వాసు, ధర్మాగౌడ్‌ తదితరులు పాల్గొన్నారు..