కస్తూర్బాల్లో నాణ్యమైన విద్య అందుతుందని జీఈసీఓ విజయకుమారి అన్నారు. డివిజన్ కేంద్రంలోని కస్తూర్బాగాంధీ పాఠశాలలో జరుగుతున్న పలు నిర్మాణ పనులను మంగళవారం ఇంజనీరింగ్ అధికారులతో కలిసి ఆమె పరిశీలించారు. విద్యార్థులకు అసౌకర్యం కలగకుండా సకాలంలో పనులు పూర్తి చేయాలని సూచించారు. జీఈసీఓ మాట్లాడుతూ.. పేద, అనాథ బిడ్డలకు కేజీబీవీల్లో సకల వసతులతో కూడిన విద్య అందుతుందన్నారు. యోగా, క్రీడా శిక్షణతో పాటు కరాటే వంటి ఆత్మరక్షణ విద్యలు నేర్పిస్తున్నామన్నారు. కార్యక్రమంలో ఈఈ నరేందర్రెడ్డి, డీఈ అరుణ్కుమార్, ప్రత్యేకాధికారి బి.శైలజ, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. .