అంతర్గాం మండలంలోని ఆకెనపల్లికి చెందిన గాదె సుధాకర్ పటేల్ అనే కాంగ్రెస్ కార్యకర్త ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ అభ్యర్థి గెలుపునకు కృషి చేశారు. దీంతో ఎమ్మెల్యే మక్కాన్సింగ్ రాజ్ఠాకూర్ బుధవారం ఆయనను సన్మానించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కాంగ్రెస్ను క్షేత్రస్థాయిలో బలోపేతానికి కృషి చేస్తున్న ప్రతీ కార్యకర్తకు గుర్తింపు ఉంటుందని, వారి సేవలను వినియోగించుకుంటూ సన్మానిస్తామని పేర్కొన్నారు.ముంబాయికి చెందిన రంగోత్సవ్ సెలబ్రేషన్ ఆర్గనైజేషన్ ఫర్ నేషనల్ లెవల్ ఆర్ట్ కాంపిటీషన్ ఆధ్వర్యంలో గత నెల 14న గోదావరిఖని సెక్రెట్ హార్ట్ పాఠశాలలో ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ పోటీలు నిర్వహించారు. ఈ పాఠశాలకే చెందిన 59 మంది విద్యార్థులు జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. ఫొటోగ్రఫీ, కలరింగ్, టాటూ మేకింగ్, గ్రీటింగ్ కార్డ్ మేకింగ్ తదితర కేటగిరీల్లో వీరు అర్హత సాధించారు. మొదటి బహుమతిగా ఎలక్ట్రిక్ స్కూటీ, మిగతా విద్యార్థులు బంగారు, వెండి పతకాలతోపాటు సర్టిఫికెట్స్ అందుకున్నారు. ఈ సందర్భంగా విద్యార్థులను పాఠశాల కరస్పాండెంట్ లవ్లీ జాకబ్, ప్రిన్సిపాల్ జ్యోత్స్న, ప్రైమరీ ఇన్చార్జి ఇన్నమ్మ బుధవారం అభినందించారు..