Monday 13th of May 2024

చెరువు స్థలం కబ్జా.. కేసు నమోదు

14 Dec , 2023 11:49 , IST
Article Image

‘బంధం చెరువు కబ్జా’ శీర్షికన బుధవా రం ‘సాక్షి’లో ప్రచురితమైన కథనానికి నీటిపారుదలశాఖ అధికారులు స్పందించారు. ఈమేరకు దేవన్నపేటలోని బంధం చెరువును నీటిపారుదల శాఖ డీఈఈ రాజు, ఏఈ శ్రీనివాస్‌ పరిశీలించారు. చెరువు స్థలం కబ్జా అయినట్లు గుర్తించి చెరువు శిఖం కబ్జా చేసుకుని రోడ్డు నిర్మాణం చేస్తున్న వారి గురించి ఆరా తీశారు. కబ్జాదారుడి గురించి ఆరా తీసినప్పటికీ ఆక్రమణదారుడి వివరాలు చెప్పేందుకు రైతులు ముందుకు రాలేదు.కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు దేవన్నపేటలోని బంధం చెరువు శిఖాన్ని ఆక్రమించుకుని రోడ్డు నిర్మిస్తున్నారని ఏఈ శ్రీనివాస్‌ బుధవారం హసన్‌పర్తి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. నిందితులను గుర్తించి చర్యలు తీసుకోవాలని కోరారు. .