మండల పరిధిలోని జంగాలపల్లి బాలికల మినీ గురుకులంలో సోమవారం వాజేడు వైద్యాధికారి మధుకర్ ఆధ్వర్యంలో వైద్య శిబిరం నిర్వహించారు. మినీ గురుకులంలోని విద్యార్థినులకు సోమవారం వైద్య పరీక్షలను నిర్వహించి మందులను అందించారు. జంగాలపల్లి మినీ గురుకులంతో పాటు అరుణచలపురం, పూసూరు గ్రామాల్లో ఉన్న విద్యార్థిని, విద్యార్థులకు చికిల్ సలేమియా వైద్య పరీక్షలను నిర్వహించారు. జలుబు, దగ్గు, జ్వరం ఉన్న వారికి మందులను అందించడంతో పాటు రక్త నమూనాలను సేకరించారు. ఈ వైద్య శిబిరంలో సీహెచ్ఓ సూర్యప్రకాష్, కోటిరెడ్డి, చిన్న వెంకటేశ్వర్లు, చాయాదేవి, రజనీ కాంత్, శకుంతల ఉన్నారు..