ప్రజలతో సత్సంబంధాలు కొనసాగిస్తూ శాంతి భద్రతల పరిరక్షణకు పాటుపడాలని జనగామ డీసీపీ సీతారాం అన్నారు. బుధవారం స్థానిక పోలీస్స్టేషన్ను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేసి రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా స్టేషన్ పరిధిలో పెండింగ్ కేసుల పరిష్కారం దిశగా చర్యలు తీసుకోవాలని, ఎన్నికలు ముగిసిన నేపథ్యంలో పల్లెల్లో ప్రశాంత వాతావరణం ఉండేలా నిత్యం పర్యవేక్షించాలని సూచించారు. ఎస్సై కొంగరి శ్రవణ్కుమార్, ఏఎస్సై సదానందం, హెచ్సీ శ్రీనివాస్, సదయ్య, శ్యామ్, పోలీస్ సిబ్బంది యాకుబ్ తదితరులు పాల్గొన్నారు..