బీఆర్ఎస్ పార్టీ కోసం నిరంతరం శ్రమించిన నాయకుడు పాగాల సంపత్రెడ్డి.. మన మధ్య లేకున్నా ఆయన ఆశయ సిద్ధికి పనిచేస్తామని శాసన మండలి డిప్యూటీ చైర్మన్ డాక్టర్ బండా ప్రకాష్, స్టేషన్ఘన్పూర్, జనగామ ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, పల్లా రాజేశ్వర్రెడ్డి అన్నారు. ఇటీవల గుండె పోటుతో మరణించిన జెడ్పీ చైర్మన్, బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు పాగాల సంపత్రెడ్డి సంతాప సభను రాజవరంలో బుధవారం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళుల్పించిన అనంతరం వారు మాట్లాడారు. సంపత్రెడ్డి విద్యార్థి దశ నుంచే ఉద్యమ కారుడని, 2001లో కేసీఆర్ పిలుపు మేరకు తెలంగాణ రావాలి.. రాష్ట్రరం బాగుపడాలనే ఉద్దేశంతో తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నాడని పేర్కొన్నా రు. ఏనాడూ.. డబ్బులు, పదవుల కోసం ఆశ పడని మంచి వ్యక్తి అని, ఆయన కుటుంబానికి అండగా ఉంటామని చెప్పారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు ఎర్రబెల్లి దయాకర్రావు, పెద్ది సుదర్శన్రెడ్డి, ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, డాక్టర్ రాజయ్య, నాయకులు కృష్ణారెడ్డి, పొట్లపల్లి శ్రీధర్రావు, మామిడాల లింగారెడ్డి, మారేపల్లి తిరుమల, మారేపల్లి లలితా దేవి, కృష్ణమోహన్రెడ్డి, శ్యాంకుమార్రెడ్డి, కేశిరెడ్డి రాకేష్రెడ్డి, మనోజ్రెడ్డి, పోలేపల్లి రంజిత్రెడ్డి, జనగాం యాదగిరి, తాళ్లపల్లి సమ్మయ్య, తీగల మహేందర్ తదితరులు పాల్గొన్నారు..