Tuesday 14th of May 2024

శ్రీ మద్భగవద్గీత సామూహిక ఆరాధనలు ప్రారంభం

14 Dec , 2023 01:31 , IST
Article Image

మండలంలోని వైకుంఠపురంలోని భగవాన్‌ శ్రీ వేదవ్యాస సనాతన ధర్మక్షేత్రంలో మద్భగవద్గీత సామూహిక ఆరాధనలు బుధవారం ప్రారంభమయ్యాయి. భగవద్గీత మానవాళికి అందిన పవిత్రమైన ఈ మాసంలో సాక్షాత్తు భగవత్స్వరూపమైన శ్రీమద్భగవద్గీతను అష్టోత్తర శతనామావళితో ఆరాధించుకునే ఈ మహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని భవఘ్ని గురూజీ తెలిపారు. ఈనెల 13వ తేదీ నుంచి జనవరి 11వ తేదీ వరకు రోజూ నిర్వహించే సామూహిక గీతారాధనల్లో భక్తులు పాల్గొనవచ్చునని తెలిపారు..