● తిరుపతికి విచ్చేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ● ఆత్మీయ ఆహ్వానం పలికిన మంత్రులు, ప్రజాప్రతినిధులు తిరుపతిలో ఓ శుభ కార్యానికి హాజరయ్యేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విచ్చేశారు. బుధవారం సాయంత్రం 4.10 గంటలకు రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న ఆయనకు ఘన స్వాగతం లభించింది. ముఖ్యమంత్రి వెంట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్రెడ్డి వచ్చారు. ముఖ్యమంత్రికి ఎయిర్పోర్టులో డిప్యూటీ సీఎం నారాయణస్వామి, మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆర్కే రోజా, టీటీడీ బోర్డు చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి, ఎంపీ గురుమూర్తి, ఎమ్మెల్యేలు బియ్యపు మధుసూదన్రెడ్డి, కోనేటి ఆదిమూలం, మేడా మల్లికార్జునరెడ్డి, కిలివేటి సంజీవయ్య, ఎమ్మెల్సీలు సిపాయి సుబ్రమణ్యం, మేరిగ మురళీధర్, ఆర్టీసీ వైస్ చైర్మన్ విజయానందరెడ్డి, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు నేదురుమల్లి రామ్కుమార్రెడ్డి, చిత్తూరు జిల్లా కలెక్టర్ షణ్మోహన్, తిరుపతి నగర మేయర్ శిరీష, డిప్యూటీ మేయర్ భూమన అభినయ్రెడ్డి, తుడా చైర్మన్ చెవిరెడ్డి మోహిత్రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు దేశాయి తిప్పారెడ్డి, సునీల్కుమార్, తిరుపతి నగర కమిషనర్ హరిత, డీఐజీ అమ్మిరెడ్డి, ఎస్పీలు పరమేశ్వరరెడ్డి, రిషాంత్రెడ్డి, ఆర్డీఓ రవిశంకర్రెడ్డి తదితరులు స్వాగతం పలికారు. తిరుపతి పర్యటన అనంతరం 5.30 గంటలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రేణిగుంట ఎయిర్పోర్టుకు చేరుకుని ప్రత్యేక విమానంలో విజయవాడకు బయలుదేరారు. ఆయనకు మంత్రులు, ప్రజాప్రతిధులు, అధికారులు సాదరంగా వీడ్కోలు పలికారు. .