Sunday 28th of April 2024

జ్యోతి సురేఖకు రజతం

14 Dec , 2023 06:19 , IST
Article Image

తావోయువాన్‌ సిటీ (చైనీస్‌ తైపీ): వరల్డ్‌ ఇండోర్‌ ఆర్చరీ సిరీస్‌లో భాగంగా జరిగిన తైపీ ఓపెన్‌ టోర్నీలో మహిళల కాంపౌండ్‌ వ్యక్తిగత విభాగంలో భారత్‌కు స్వర్ణ, రజత పతకాలు లభించాయి. ఆసియా క్రీడల స్వర్ణ పతక విజేత, ఆంధ్రప్రదేశ్‌ అమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ రజత పతకం సాధింఅదే విధంగా.. భారత్‌కే చెందిన పర్ణీత్‌ కౌర్‌ పసిడి పతకాన్ని సొంతం చేసుకుంది. కాగా ఫైనల్లో జ్యోతి సురేఖ 145–146తో పర్ణీత్‌ కౌర్‌ చేతిలో ఓడిపోయింది. ఇక పురుషుల కాంపౌండ్‌ వ్యక్తిగత విభాగంలో భారత ఆర్చర్‌ ప్రథమేశ్‌ స్వర్ణ పతకం నెగ్గాడు. ఫైనల్లో ప్రథమేశ్‌ 149–148తో మైక్‌ ష్లాసెర్‌ (నెదర్లాండ్స్‌)ను ఓడించాడుచింది..