తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ సేవా డేస్ కార్యక్రమం రెండో రోజు హైదరబాద్లోని టీ-హబ్లో ఘనంగా జరిగింది. TTA ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో స్టార్టప్, ఇన్వెస్ట్మెంట్, ఏఐ అంశాలపై సెమినార్ నిర్వహించారు. ఇందులో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ప్రిన్సిపల్ సెక్రటరీ , ఐఏఎస్ అధికారి జయేష్ రంజన్, ఎమర్జింగ్ టెక్నాలజీస్ డైరెక్టర్ రమాదేవి, హైదరాబాద్ ఐఐఐటీ కో-ఇన్నోవేషన్ ప్రొఫెసర్ రమేష్ లోగనాథన్ పాల్గొని ప్రసంగించారు.టీటీఏ సభ్యులు తమ ప్రసంగాలతో అందరినీ ఆకట్టుకున్నారు. మారుమూల గ్రామాల నుంచి విదేశాలకు వెళ్లి ఎంప్లాయిమెంట్ సృష్టించి ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్న విజయ గాద తన ప్రసంగంతో యువ పారిశ్రామికవేత్తలను విశేషంగా ఆకట్టుకుంది. అనంతరం పలువురిని ఘనంగా సత్కరించి సన్మానించారు..