Monday 29th of April 2024

అంకుల్‌.. నా పేరెందుకు ‍స్మరిస్తున్నారంటూ రేణు దేశాయ్‌ కామెంట్లు

09 Dec , 2023 08:14 , IST
Article Image

సినీ నటి రేణు దేశాయ్ సుదీర్ఘ విరామం తర్వాత 'టైగర్ నాగేశ్వరరావు' చిత్రం ద్వారా ఇటీవలే వెండితెరపై కనిపించారు. ఈ సినిమాలో ఒక కీలక పాత్రతో ఆమె మెప్పించారు. చాలాకాలం తర్వాత మళ్లీ మేకప్‌ వేసుకుని  ప్రేక్షకులను పలకరించారు. ఆమె రీ ఎంట్రీతో పాటు మరో పెళ్లి అంశంపై  ఓ సీనియర్‌ జర్నలిస్ట్‌ ఒక ఇంటర్వ్యూలో తన అభిప్రాయాన్ని చెప్పాడు. ఆయన చేసిన వ్యాఖ్యలు ఈ మధ్య వైరల్‌ అయ్యాయి.  ఆమె వ్యక్తిగత విషయాలపైనా ఆయన చేసిన కామెంట్స్‌ క్లిప్పింగ్స్‌ను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేస్తూ ఆయనపై వ్యంగ్యాస్త్రాలు సందించారు రేణు. సమాజంలో మహిళలను తక్కువగా చూడడం తగదని ఆమె సూచించారు..